అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల చైర్మన్ నారాయణస్వామి ఆధ్వర్యంలో అనంతపురం క్లాక్ టవర్ వద్ద సోమవారం నాలుగున్నర గంటల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం వేడుకల్లో ఇంద్రధనస్సు పేరుతో సీఎం చంద్రబాబు వయోవృద్ధులకు వికలాంగులకు సంక్షేమ పథకాలు ప్రకటించినందుకు కృతజ్ఞతగా ర్యాలీ నిర్వహించి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించడం జరిగిందని రాప్తాడు చెందిన విభిన్న ప్రతిభావంతుల చైర్మన్ నారాయణస్వామి పేర్కొన్నారు.