డోన్: బేతంచర్ల మండలంలో నిర్వహించిన ఎంజేపి ప్రవేశ పరీక్షకు భారీగా తరలివచ్చిన విద్యార్థులు
Dhone, Nandyal | Apr 12, 2026 బేతంచెర్ల మండలం గోరుమానుకొండ ఎంజేపీ 5వ తరగతి ప్రవేశ పరీక్షకు ఆయా ప్రాంతాల నుంచి భారీగా విద్యార్థులు, తల్లిదండ్రులు వచ్చారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రవేశ పరీక్ష ఉండగా 9 గంటలకే పరీక్ష కేంద్రం వద్దకు చేరుకున్నారు. సుమారు 999 విద్యార్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థులను తనిఖీ చేసిన తర్వాత పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు.