రాజేంద్రనగర్: షాద్నగర్ లో ఈనెల 15న స్పెషల్ లోక్ అదాలత్
షాద్నగర్ కోర్ట్ కాంప్లెక్స్లోని సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందించిన న్యాయమూర్తి స్వాతి రెడ్డి సోమవారం 16వ జిల్లా అదనపు & సెషన్స్ జడ్జిగా సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 15న నిర్వహించే స్పెషల్ లోక్ అదాలత్ సందర్భంగా మండల న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గా పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యే దిశగా ప్రయత్నించాలని ఆదేశించారు.