ఆలయ అపవిత్ర ఘటనలపై MLA రాజాసింగ్ మంగళవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2023 నుంచి రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే హిందూ ఓట్లను గుర్తు చేస్తున్నారని విమర్శించారు. సఫిల్గూడ మైసమ్మ ఆలయంలో జరిగిన ఘటనలో నిందితుడు కర్ణాటకకు చెందినవాడని తెలిపారు. అతడిని మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు పేర్కొనడాన్ని తప్పుబట్టారు. నిందితుడికి బెయిల్ రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.