హిమాయత్ నగర్: బోరబండ డివిజన్లో 15 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని బోరబండ డివిజన్లో సీఎం సహాయనిధి చెక్కుల కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హాజరై 15 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు సీఎం సహాయనిధి వరం లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.