తుర్కయంజాల్ మున్సిపాలిటీ విలీనానికి వ్యతిరేకంగా ప్రజా ఆగ్రహం ఉప్పొంగింది. చార్మినార్ జోన్లో కలపడం సరైంది కాదంటూ సీపీఎం నేతలు జాతీయ రహదారిపై బేటాయించి నిరసనకు దిగారు. దగ్గరలోనే ఉన్న ఎల్బీనగర్ జోన్లో విలీనం చేస్తే ప్రజలకు సౌలభ్యం ఉండేదని ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డికి ఈ విషయంలో సరైన అవగాహన లేనట్టుగా వ్యవహరించారని నేతలు మండిపడ్డారు.