షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలో మంగళవారం జరిగిన వ్యక్తి హత్య కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. పోలీసుల వివరాలు.. ఓ వెంచర్లోని ఇంటి నిర్మాణంలో పనిచేసే సంశూల్, గంగా ప్రసాద్కు పని విషయంలో గొడవలు ఉండటంతో, పడుకొని ఉన్న సంశూల్ తలపై గంగాప్రసాద్ రాయితో కొట్టి హత్య చేశాడన్నారు. గంగ ప్రసాద్ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిపారు