పెద్ద కడబూరు: ఎల్ఎల్సి నీటిని ఫిబ్రవరి నెలాఖరు వరకు విడుదల చేయాలని, పెండింగ్లో ఉన్న పొజిషన్ సర్టిఫికెట్లను వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిపిఎం నాయకులు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు తిక్కన్న శ్రీనివాసులు మాట్లాడుతూ సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, ఇప్పటికే రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పెండింగ్లోని భూ సమస్యలను తహశీల్దార్ పరిష్కరించాలని వారు కోరారు.