మార్కాపురం మున్సిపాలిటీ గత కొన్ని నెలలుగా అభివృద్ధికి నోచుకోలేదని బిజెపి అసెంబ్లీ మాజీ ఇంచార్జి పివి కృష్ణారావు అన్నారు. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం జరగకుండా వాయిదాలు వేస్తున్నారని దీంతో పట్టణ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించాల్సిన సమావేశాలు నిర్వహించడం లేదన్నారు. మున్సిపల్ చైర్మన్, అధికారుల సమన్వయ లోపంతో ఈ పరిస్థితి నెలకొన్నది అన్నారు