మంత్రాలయం:ఆదోని జిల్లా సాధన కోసం మంత్రాలయం మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు సుంకేశ్వరి గ్రామానికి చెందిన 20 మంది గ్రామస్థులు స్వామినాథం, బాలస్వాముల నాయకత్వంలో దీక్షలో పాల్గొన్నారు. శుక్రవారం జేఏసీ కన్వీనర్ రామతీర్థం అమరేష్ పిలుపు మేరకు మంత్రాలయం దళిత సంఘాలు, రాయలసీమ సాధన సమితి, బీఎస్పీ, ఎమ్మార్పీఎస్ బీసీ సంఘాలు, వివిధ యూనియన్ల నాయకులు భారీ సంఖ్యలో హాజరై మద్దతు తెలిపారు. ఆదోని జిల్లాతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.