ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్న రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. ఆయా రంగాలలో జిల్లాకు సంబంధించిన ప్రగతి మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయం నుంచి మంత్రులు, కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం భవనము నుంచి ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. జి.ఎస్.డి.పి, 10 సూత్రాలు, ఆదాయార్జన శాఖల పనితీరు, కేంద్ర ప్రభుత్వ పథకాలు,మొదలైన అంశాలపై చర్చించారు