నూతన సంవత్సరం సందర్భంగా సరూర్నగర్లోని ప్రియదర్శిని పార్కుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పార్కుకు చేరుకోవడంతో పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. కొత్త సంవత్సరం వేడుకలను ఆనందంగా గడిపేందుకు చిన్నారులతో పాటు పెద్దలు కూడా పార్కులో సందడి చేశారు.పార్కు వద్ద ఏర్పడిన భారీ రద్దీ కారణంగా బయట ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు గురువారం సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.