నందికోట్కూరు: కొత్తపల్లి గ్రామంలో 108 సంవత్సరాల కురువృద్ధుడు బాల సుబ్బారెడ్డి మృతి
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల కేంద్రమైన కొత్తపల్లి గ్రామంలో 108 సంవత్సరాల కురువృద్ధుడు బాల సుబ్బారెడ్డి మృతి చెందారు, ఈయన గ్రామ అభివృద్ధికి, గ్రామంలోని సమస్యల పరిష్కారానికి ఆలయాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని గ్రామస్తులు తెలిపారు, కొంతకాలంగా ఈయన అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు, గ్రామంలోని పలువురు ఆయన మృతికి సంతాపం తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని గ్రామస్తులు మనస్ఫూర్తిగా కోరుకున్నారు