తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో రూ.25కోట్లతో 10 MLD STP నిర్మాణానికి MLA సబితా ఇంద్రరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంట్ ద్వారా ఇళ్లు, అపార్ట్మెంట్లు, పరిశ్రమల నుంచి వచ్చే మురుగు నీటిని శుద్ధి చేసి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యమని చెప్పారు. శుద్ధిచేసిన నీటిని తోటలు, పార్కులు, కూలింగ్ టవర్లు, చెరువుల నింపుదలకు వినియోగించనున్నట్టు వివరించారు.