ఒంగోలు అర్బన్: ఒంగోలు కిమ్స్ ఆసుపత్రిలో వెల్లివిరిసిన మానవత్వం, బ్రెయిన్ డెడ్ అయిన లక్ష్మయ్య అవయవదానం చేసిన కుటుంబ సభ్యులు
Ongole Urban, Prakasam | May 10, 2026
ఒంగోలు కిమ్స్ హాస్పిటల్లో మానవత్వం పరిమళించింది. బైక్ ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన కొమ్మూరు లక్ష్మయ్య (50) అవయవాలను దానం చేసేందుకు ఆయన కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. జిల్లా చరిత్రలోనే ఇలా అవయవ దానం జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కిమ్స్ వైద్యులు మాట్లాడుతూ.. జిల్లాలో తొలిసారిగా తమ ఆసుపత్రి ద్వారా ఈ ప్రక్రియ జరగడం గర్వకారణమని, ఒకరి మరణం మరొకరికి ప్రాణదానం కావాలని వారు పిలుపునిచ్చారు.