నగరంలోని బీఆర్కే భవన్లో ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు కలిశారు. కాంగ్రెస్ యథేచ్చగా ప్రలోభాలకు గురి చేస్తూ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తుందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్,మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరారు.