ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి , ఎమ్మెల్యే కురుగొండ్ల
Gudur, Tirupati | Nov 23, 2025 ప్రముఖ క్షేత్రమైన పెంచలకోన క్షేత్రంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం పర్యటించారు. పెంచలకోన ఆలయ ప్రాంగణంలో రూ.6.50 కోట్ల నిధులతో శ్రీ ఆదిలక్ష్మీ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరిక మేరకు అనేక ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు... వెంకటగిరి పోలేరమ్మ జాతరలో ధ్యాన మందిరానికి శంకుస్థాపన చేసి నిధులిచ్చామన్నారు.