నంద్యాల అర్బన్: నంద్యాలలో తాలూకా పోలీస్ స్టేషన్ నందు ఉద్రిక్త వాతావరణం, ఆటో కార్మికులకు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగిన మాజీ ఎమ్మెల్యే భూమ
Nandyal Urban, Nandyal | Jun 9, 2026
నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆటోనగర్ కార్మికులతో కలిసి స్టేషన్ ముందు నిరసనకు దిగాడు. ఆటో కార్మికులకు స్థలాలు కేటాయింపులు అన్యాయం చేసిన వారిపై వెంటనే కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఆటోనగర్ ప్రెసిడెంట్ జాకీర్ పై చీటింగ్ కేసు నమోదు చేసే వరకు ఇక్కడి నుంచి కదలమంటూ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కార్మికులు రోడ్డు పై డేటాయించడంతో త్రీటౌన్ సీఐ ఈశ్వరయ్యకు మాజీ ఎమ్మెల్యేకు మధ్య తీవ్రవాక్కువాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది