ఒంగోలు అర్బన్: జూలై 1నుండి అగ్రికల్చర్ మార్కెట్ చెక్ పోస్టుల వద్ద నగదు రహిత వసూళ్లు : సహాయ మార్కెటింగ్ సంచాలకులు
Ongole Urban, Prakasam | Jun 27, 2026
సహాయ మార్కెటింగ్ సంచాలకులు, ఒంగోలు వారు తేది: 27.06.2026 న వారి కార్యాలయం నందు జిల్లా పరిధిలోని అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శులు, సూపర్ వైజర్స్, మరియు వ్యాపార ప్రతినిధులతో e-Permit విధానం అమలుపై అవగాహన సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో e-Permit వ్యవస్థ యొక్క విధివిధానాలు, ప్రయోజనాలు, ఆన్లైన్ ప్రక్రియ మరియు అమలు విధానం గురించి సమగ్రంగా వివరించారు. వ్యాపారస్తుల మరియు మార్కెట్ కమిటీలు e-Permit విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. అదేవిధంగా, తేది 01.07.2026 నుండి ఆంధ్రప్రదేశ్లోని అన్ని వ్యవసాయ మార్కెట్ చెక్పోస్టుల వద్ద నగదు రహిత వసూళ్లు ఉంటాయని అన్నారు