మార్కాపురం జిల్లా గిద్దలూరు టిడిపి కార్యాలయంలో ఆదివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు దరఖాస్తు చేసుకున్న 73 మందికి దాదాపు 43 లక్షల రూపాయల విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించినట్లు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పేర్కొన్నారు. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు అడిగిన వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.