భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు మరియు రూ.10 వేల జరిమానా విధిస్తూ కర్నూలు మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి శ్రీమతి కమలా దేవి గారు ఈరోజు తీర్పు వెలువరించారు.వివరాల ప్రకారం — కర్నూలు శివప్పనగర్కు చెందిన శ్రీనివాసులు, లక్ష్మీదేవి 2007లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారు కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నివసిస్తూ జీవనం సాగిస్తున్నారు. శ్రీనివాసులు ఆర్టీసీ బస్టాండ్ వద్ద టీ స్టాల్ నడిపేవాడు. అయితే అతని పై కర్నూలు నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్లో రౌడీ షీట్ నమోదై ఉంది.కానీ వివాహానంతరం 11 సంవత్సరాల తర్వాత భార్య ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తూ తరచుగా గొడవపడేవాడు. ఈ క్రమంలో 2018 నవ