ఒంగోలు అర్బన్: బిసివై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష కు మద్దతు తెలపాలని కోరిన బీసీ సంఘాల నేతలు.
Ongole Urban, Prakasam | Apr 3, 2026
బిసివై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 11 వ తారీఖున తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్ష కు మద్దతు తెలియజేయాలని ఒంగోలు లో భారత చైతన్య యువజన పార్టీ నాయకులు శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 11 వ తేదీ న బోడె రామచంద్ర యాదవ్ బీసీ ధర్మ దీక్ష పేరుతో తలపెట్టనున్న ఆమరణ నిరాహారదీక్ష కు బీసీ సంఘాలు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.బీసీ సింహ గర్జన లో ప్రవేశ పెట్టిన ఐదు ప్రధాన డిమాండ్లను "బీసీ ల రక్షణ చట్టం,రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాల భూమి కేటాయింపు,బీసీ కార్పొరేషన్ నిధులు,పై చర్చిస్తారని తెలిపారు.