సైబర్ నేరాలను అరికట్టడానికి HYD సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పిలుపుతో ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం జరిగింది. ఓ విద్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సైబర్ నేరాలను ప్రజలే ముందుగా అడ్డుకోవచ్చని, ఏదైనా మోసం జరిగిన వెంటనే 1930కు కాల్ చేయాలని ఆమె సూచించారు.