అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం 6:15 నిమిషాల సమయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గం చెందిన తొమ్మిది మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గానికి చెందిన 9 మందికి ఎన్టీఆర్ వైద్య సేవలో అందరి వారికి తొమ్మిది లక్షల 47 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని భవిష్యత్తులో ఎన్టీఆర్ వైద్య సేవలో అందరి వారికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేందుకు తమ వంతు సహకారం అందిస్తామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.