కడప: గత ప్రభుత్వం చేపట్టిన మనబడి నాడు నేడు పనులను పూర్తి చేయాలి: శాసనమండలిలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి
Kadapa, YSR | Sep 24, 2025 గత ప్రభుత్వం చేపట్టిన మన బడి నాడు-నేడు పనులను పూర్తి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కోరారు. ఈరోజు శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ వ్యాప్తంగా అనేక చోట్ల మన బడి నాడు-నేడు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రభుత్వం చొరవ చూపించి పరిష్కారం చూపాలన్నారు.