ఒంగోలు అర్బన్: ఒంగోలు మండలం చెరుకుపాలెం గ్రామ సమీపంలో చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు అదృశ్యం, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Ongole Urban, Prakasam | Jun 4, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరుకుపాలెం గ్రామ సమీపంలోని చెరువులో గురువారం నలుగురు చిన్నారులు ఈతకు వెళ్లి గల్లంతైన సంఘటన చోటుచేసుకుంది. చిన్నారుల బట్టలు చెరువు గట్టుపై ఉండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. అభిరామ్, సుశాంత్, చిన్ను, దినేష్ అనే చిన్నారులు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు వారికోసం గాలిస్తున్నారు.