మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎదులాబాద్ గోదా సమేత మన్నార్ రంగనాయక స్వామి ఆలయంలో గోదాదేవి కళ్యాణం ఘనంగా జరిగింది. కళ్యాణోత్సవాన్ని వీక్షించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. అంతకుముందు ఏమ్మెల్యే మల్లారెడ్డి దంపతులు, భద్రారెడ్డి దంపతులు గోదా రంగనాయక స్వామికి పట్టు వస్త్రాలు అందజేశారు. ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామస్థులు, భక్తులు తదితరులు ఉన్నారు.