కనిగిరి పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో డిసెంబర్ 13వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలని కనిగిరి జూనియర్ సివిల్ జడ్జ్ రూప శ్రీ సూచించారు. కనిగిరిలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు హాలులో ఆ సోమవారం న్యాయవాదులతో జడ్జ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సివిల్, క్రిమినల్, భరణం కేసులతోపాటు బ్యాంకు సంబంధిత కేసులను కూడా జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకునేందుకు చక్కని అవకాశం కక్షిదారులకు లభిస్తుందన్నారు. న్యాయవాదులు కక్షిదారులకు అవగాహన కల్పించి, జాతీయ లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకునే విధంగా చూడాలని జడ్జి సూచించారు.