మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డమీద పల్లి గ్రామస్తులు పెద్దపులి సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అటవీశాఖ అధికారుల అప్రమత్తమయ్యారు. పులి కదలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎవరు భయపడవద్దని పశువులను మేతకు తీసుకెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు తెలిపారు.