అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు జారిపడి యూపీ కి చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 9, 2026
అనంతపురం నగరంలోని రైల్వే స్టేషన్ లో రైలు ఎక్క బోయి ప్రమాదవశాత్తు జారిపడి ఉత్తర ప్రదేశ్ కు చెందిన సుశీల్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి గురువారం రైల్వే ఎస్సై వెంకటేష్ వివరాలను వెల్లడించారు. బెంగళూరు నుంచి న్యూఢిల్లీ వెళ్లే కేకే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్క బోయి ప్రమాదవశాత్తు జారి పడడంతో సుశీల్ అనే వ్యక్తికి గాయాలయ్యాయని తెలిపారు. దీంతో అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.