అనంతపురం జిల్లా ఉరవకొండ విడపనకల్లు మండలాల పరిధిలో రైతులు సాగు చేసిన మిరప పంటలో విల్ట్, నల్ల తామర తీవ్రతపై ఉద్యానవన శాఖ జిల్లా అధికారిని ఉమాదేవి, రేకులకుంట పరిశోధన కేంద్రం ఉద్యానవన శాస్త్రవేత్త రమణలు స్థానిక వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. శాస్త్రవేత్తలు బృందం సభ్యులు మిరప రైతులు పాటించవలసిన సస్యరక్షణ చర్యలను వివరించారు. మిరప పంటలో విల్ట్, నల్ల తామర తీవ్రతను రైతులకు వివరించి చేపట్టాల్సిన చర్యలను శాస్త్రవేత్తలు వివరించారు.