బడంగ్పట్ ను ప్రత్యేక జోన్గా ఏర్పాటు చేయాలని కోరుతూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం సచివాలయంలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణను కూడా కలిసి ఇదే డిమాండ్ను విన్నవించారు. మాజీ కార్పొరేటర్లు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.