ఒంగోలు అర్బన్: ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీకోసం కార్యక్రమంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు కు 74 అర్జీలు ఇచ్చిన బాధితులు
Ongole Urban, Prakasam | Apr 13, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు 74 అర్జీలు వచ్చాయి. ప్రజలతో నేరుగా మాట్లాడిన ఎస్పీ అర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని ఎస్పీ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మీకోసం కార్యక్రమం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలపై ఎస్పీ హర్షవర్ధన్ రాజును కలిసి అర్జీలు అందజేశారు.