తాడిపత్రి, ఎర్రగుంట లలో ఆదివారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ నాయకులు తాడిపత్రి నుంచి ఎర్రగుంట గ్రామం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎర్రగుంటలో మాదిగ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. మాదిగ అమరవీరులకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు.