బ్రహ్మసముద్రం పోలీసులు సోమవారం రాత్రి బండి సుబ్రహ్మణ్యం అనే చైన్ స్నాచర్ ను అరెస్టు చేసి దొంగలించిన బంగారు చైన్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వివరాలను డీఎస్పీ రవిబాబు విలేకరులకు తెలిపారు. గత నెల 19న నంజాపురం గ్రామానికి చెందిన తులసి అనే మహిళ స్కూటీలో గ్రామానికి వెళుతుండగా దొంగ స్కూటీని ఆపి చైన్ ఎత్తుకెళ్లాడు. ఈ క్రమంలో పోలీసులు విచారణ, దర్యాప్తు చేపట్టారు. బంగారు చైన్ ను ఎత్తుకెళ్లిన దొంగ బండి సుబ్రహ్మణ్యం ను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు.