బనగానపల్లె ఆర్టీసీ బస్టాండ్ తనిఖీ చేసిన కడప జోన్ ఫోర్ ED రాఘవ కుమార్
నంద్యాల జిల్లా బనగానపల్లె ఆర్టీసీ బస్టాండ్ను కడప జోన్-4 ఈడీ రాఘవకుమార్ తనిఖీ చేశారు. త్వరలో ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. బస్టాండ్ పరిశుభ్రత, ప్రయాణికులకు మెరుగైన సేవలపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. 40 ఏళ్లు దాటిన ఉద్యోగులకు హెల్త్ చెకప్ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎం శశి భూషణ్, ఆర్ఎం రజియా సుల్తానా పాల్గొన్నారు.