అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని కాలనీలలో పల్స్ పోలియోపై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని ఎంపీడీవో లక్ష్మీనారాయణ వైద్య సిబ్బంది వివిధ శాఖల అధికారులు కలిసి శనివారం నిర్వహించారు. ఆదివారం ప్రతి గ్రామంలోనూ ఏర్పాటు చేస్తున్న పల్స్ పోలియో పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి తల్లిదండ్రులు తమ చిన్నారులకు తప్పనిసరిగా పోలియో నివారణ వ్యాక్సిన్ డోస్ వేయించాలని ఏ ఒక్కరూ కూడా అశ్రద్ధ చేయకూడదని ఎంపీడీవో ఈ సందర్భంగా సూచించారు.