బాచుపల్లి సురవరం ప్రతాప్రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో విద్యార్థి ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. యూనివర్సిటీలో బీ. డిజైన్ 3వ సంవత్సరం చదువుతున్న పరశురామ్(22) యూనివర్సిటీ హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లిదండ్రులు, బంధువులు విశ్వవిద్యాలయం వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. కుమారుడి ఆత్మహత్యకు కారణాలు బయటపెట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు.