కనిగిరి పట్టణంలోని షాది ఖానా నందు జిల్లా పంచాయతీ అధికారి ఎం వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి కనిగిరి డివిజన్ పరిధిలోని ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులతో గురువారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీల వారీగా పంచాయతీల అభివృద్ధి, పన్నుల వసూలు, పారిశుద్ధ్య కార్యక్రమాలపై సమీక్షించారు. జిల్లాలోని కనిగిరి డివిజన్ అభివృద్ధి పథంలో ముందుండాలని సూచించారు. గ్రామాల్లో పన్నుల వసూలు వేగవంతం చేయాలని, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా స్వచ్ఛత గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.