నగరంలోని ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాం : అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్
Anantapur Urban, Anantapur | Apr 5, 2026
అనంతపురం నగరంలోని ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించినట్లు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో కూడేరు మండలం ముద్దలాపురం వద్ద 16 ఎం.ఎల్.డి వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, కూటమి పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ 2017 లో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో ఈ నీటి శుద్ధి కేంద్రం ప్రారంభమైందన్నారు. అయితే వైసిపి ఉన్న ఐదేళ్లలో ఒక అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. దీనివలన ప్రజలకు తాగునీటి సమస్య ఏర్పడిందన్నారు.