ఒంగోలు అర్బన్: ఎఫ్ ఎల్ ఎస్ సర్వే పై ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ కు పలు సూచనలు అందించిన విద్యాశాఖ అధికారులు ఈ
Ongole Urban, Prakasam | Apr 13, 2026
దేశవ్యాప్త సర్వేలో భాగంగా ఎఫ్.ఎల్.ఎస్–2026 సర్వే ప్రకాశం జిల్లాలోని 15 పాఠశాలల్లో నిర్వహించబడుతోంది. ఈ సందర్భంగా,సోమవారం డైట్ విద్యార్థులు (ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్) కు సమావేశం నిర్వహించి, సర్వే నిర్వహణ విధానంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించబడింది. జిల్లా స్థాయిలో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్గా పనిచేస్తున్న డైట్ విద్యార్థులకు శాంపిల్ సర్వే ఎలా చేయాలి, డేటా సేకరణ విధానం ఎలా ఉండాలి అనే అంశాలపై సమగ్రంగా వివరించబడింది. ఈ సర్వేలో తెలుగు, ఇంగ్లీషు, గణితం వంటి అంశాలకు సంబంధించిన వివరాలను ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ ట్యాబ్లెట్లో నమోదు చేయనున్నారు.