కనిగిరి మండలంలోని పేరంగుడిపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న నడికుడి_శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణ పనులను కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులు ఎలా సాగుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైల్వే లైన్ నిర్మాణ పనులు కనిగిరి వరకు దాదాపు పూర్తికావచ్చాయని, మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.