రాయగడ , ఒడిశా రాష్ట్రం నుంచి ముంబయికి గంజాయి తరలిస్తుండగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ సంయుక్తంగా పట్టుకున్నారు. బిహార్కు చెందిన అజయ్కుమార్, రీనా దేవిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 18.823 కిలోల పొడి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.9.41 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. 2 ఫోన్లు, రైల్వే టికెట్ స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు పంకజ్ పరారీలో ఉన్నాడు.