34 డివిజన్లోని 74వ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్
Anantapur Urban, Anantapur | Apr 8, 2026
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రజా సమస్యలపై ఫోకస్ చేస్తూ మరోసారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నగరంలోని 34వ డివిజన్ లోని 74వ సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే సచివాలయానికి వెళ్లిన సమయంలో కేవలం ముగ్గురు మాత్రమే సిబ్బంది కనిపించారు. 10మంది ఉండాల్సిన చోట ముగ్గురే ఎందుకు ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఇందులో నలుగురు ఫీల్డ్ విసిట్ వెళ్లారని.. మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఫీల్డ్ లో ఉన్నవారికి ఫోన్లు చేసి ఏ పని మీద వెళ్లారన్న అంశాల గురించి తెలుసుకున్నారు.