కనిగిరి మండలం లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన 17 కుటుంబాల వారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి కనిగిరి ఎమ్మెల్యే మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి సమక్షంలో గురువారం టిడిపిలో చేరారు. పార్టీలో చేరిన వీరందరికీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి స్థానిక టిడిపి కార్యాలయంలో టిడిపి కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టిడిపిలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.