సీఎం చంద్రబాబు రాజంపేట పర్యటన దృష్ట్యా కమ్యూనిస్టు నాయకుల ముందస్తు అక్రమ అరెస్టు అన్యాయం - సిఐటియు
అన్నమయ్య జిల్లా రాజంపేటలో సామాజిక పెన్షన్లు పంపిణీ కోసం సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు వస్తున్న సందర్భంగా ప్రతిపక్షాలను, అందులో ప్రధానంగా ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే కమ్యూనిస్టులను, రైతు, కార్మిక, సంఘ నాయకులను ఆదివారం రాత్రి ముందస్తు అరెస్టులు చేయడం అన్యాయం అని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ విమర్శించారు. తనను, మండల కార్యదర్శి పి.జాన్ ప్రసాద్ ను ఆదివారం రాత్రి అరెస్టు చేశారని ఆయన తెలిపారు. కమ్యూనిస్టులను ముందస్తు అరెస్టులు చేయకూడదని మంత్రి నారా లోకేష్ చెప్పిన తర్వాత కూడా రైల్వే కోడూరు పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు.