కనిగిరి పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి అన్నారు. కనిగిరి పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా కళ్యాణమండపంలో దాతల సహకారంతో సమకూర్చిన బెడ్ షీట్లను పేదలకు గురువారం ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ శిరిడి సాయిబాబా ఆలయ కమిటీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, పేదలకు అన్నదానం, వస్త్ర దానం తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో శ్రీ శిరిడి సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.