రాజేంద్రనగర్: పెద్ద అంబర్పేటలో ఇళ్లలో చోరీకి పాల్పడిన ఘటనపై కేసు నమోదు
హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధి పెద్దఅంబర్పేట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికులు తెలిపిన వివరాలు.. సదాశివ గ్రేటర్ కమ్యూనిటీలో వరుసగా 2 ఇళ్లలో భారీ చోరీ చేశారు. సెంట్రల్ లాక్ ఉన్న డోర్లను బద్దలు కొట్టి చోరీకి పాల్పడ్డ దొంగలు 5 కేజీల వెండి సామగ్రి, 35 గ్రాముల బంగారం, రూ.60 వేల నగదు, విలువైన చీరలు అపహరించారు. సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.