నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు
Nandyal Urban, Nandyal | Apr 2, 2026
నంద్యాల జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. చివరి పరీక్ష రాసి కేంద్రాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఆనందంతో సందడి చేశారు. పరీక్షలు పూర్తి కావడంతో విహారయాత్రలకు సిద్ధమయ్యారు . కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దీంతో పరీక్షల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు