దోమలగూడలో నిర్వహించిన ఆమ్ ఆద్మీ పార్టీ విలేకరుల సమావేశంలో ఏఏపీ తెలంగాణలో తన ప్రస్థానాన్ని వేగవంతం చేస్తోందని నేతలు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లక్ష 20 వేల మందికిపైగా సభ్యత్వాలు నమోదు కాగా, వివిధ జిల్లాల్లో భారీ చేరికలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రజా సమస్యలే అజెండాగా ముందుకు సాగుతూ, ఏఏపీ ప్రజలకు బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని పేర్కొన్నారు.